కదులుతున్న బస్సులో మంటలు, ఇద్దరు మృతి- గ్యాస్ సిలిండర్ వల్లే!

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2023, 11:07 AM IST

thumbnail

Gurugram Bus Fire Accident : కదులుతున్న ఓ స్లీపర్​ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల ఇద్దురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్​లో ​జరిగింది.

ఓల్వో స్లీపర్ బస్సులో సుమారు 35 నుంచి 40 మంది ప్రయాణికులు దిల్లీ నుంచి జైపుర్​కు వెళ్తున్నారు. బస్సు గురుగ్రామ్​ దగ్గరకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే లోపే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. పది మంది వరకు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. "ప్రయాణికుల దగ్గర చిన్న గ్యాస్ సిలిండర్ ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆ సిలిండర్​ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు. దీనిపై ఫోరెన్స్ బృందం దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ ఘటన అనంతరం బస్సు డైవర్ పరారయ్యాడు. అతనిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాం" అని గురుగ్రామ్ పోలీస్ కమిషనర్​ వికాస్ కుమార్ అరోడా తెలిపారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.