Citizen Youth Parliament Closing Ceremony in OU : యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది.. దేశానికి బలమైన పిల్లర్లు మీరే: గవర్నర్

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2023, 10:45 AM IST

thumbnail

Citizen Youth Parliament Closing Ceremony in OU : ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన సిటిజన్ యూత్ పార్లమెంట్ ముగింపు వేడుకలకు గవర్నర్​ తమిళిసై హాజరయ్యారు. సిటిజన్ యూత్ పార్లమెంట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని గవర్నర్ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న యూనివర్సిటీ యాజమాన్యాన్ని అభినందించారు. యువత దేశ భవిష్యత్తుకు బలమైన పిల్లర్లని అన్నారు. తాను మెడికల్ కాలేజీలో విద్యార్థిగా ఉన్నప్పుడు రాజకీయాల్లో ప్రవేశించానని.. స్టూడెంట్ లీడర్​గా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. విద్యార్థి నాయకురాలిగానే రాజకీయ నాయకురాలిగా ఎదిగానని, ఆ తర్వాత గవర్నర్​గా అవకాశం వచ్చిందన్నారు. దేశానికి యువత ఎంతో అవసరమని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరంలో కూడా యువత, విద్యార్థులే అధికంగా ఉన్నారని గుర్తు చేశారు. 

Governer Participated in Citizen Youth Parliament Closing Ceremony : తాను విద్యా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తానని గవర్నర్ చెప్పారు. యువత నిబద్ధతతో చదువుకుంటే.. రాణించగలరని అన్నారు. స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని ఆయన పుస్తకాలు చదవాలని విద్యార్థులకు సూచించారు. చదువును నిర్లక్ష్యం చేయకూడదని, అన్ని రంగాల్లో ముందుడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, ఓయూ వైస్ ​ఛాన్స్​లర్​ ప్రొఫెసర్​ రవీందర్​ యాదవ్​, రిజిస్టార్ ​ప్రొఫెసర్​ లక్ష్మీనారాయణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.