రైతులకు బోనస్​, రైతుబంధు ఎప్పుడు ఇస్తారు : హరీశ్​రావు

By ETV Bharat Telangana Team

Published : Dec 9, 2023, 5:13 PM IST

thumbnail

BRS MLA Harish Rao on Rythu Bandhu : ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ప్రకటించిన రైతు హామీలను ఎప్పుడు అమలు చేస్తారని రైతుల పక్షాన బీఆర్​ఎస్​ పార్టీ నేత హరీశ్‌రావు ప్రశ్నించారు. సోనియాగాంధీ జన్మదిన సందర్భంగా  ప్రభుత్వ నిర్ణయం కోసం రైతులంతా నిరీక్షిస్తున్నారని తెలిపారు. శాసనసభలో ప్రమాణస్వీకారాలు ముగిసిన తర్వాత హరీశ్​రావు మీడియా పాయింట్​ వద్దకు వచ్చి కాంగ్రెస్​ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. 

ప్రచారంలో రూ.500 బోనస్‌ ఇచ్చి వడ్లను కొనుగోలు చేస్తామని, రూ.15 వేలు రైతుబంధు ఇస్తామని వెల్లడించారని ఆయన గుర్తు చేశారు. ధాన్యాన్ని అమ్ముకోవద్దని కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన తర్వాత బోనస్​తో పాటు కొనుగోలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారన్నారు. ఆ హామీలు ఎప్పుడు అమలవుతాయని ప్రశ్నించారు. తుపాను వల్ల వడ్లు తడిసిపోయి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని హరీశ్ ప్రభుత్వాన్ని కోరారు. మీడియా పాయింట్​ వద్ద హరీశ్​రావుతో పాటు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు ఉన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.