సీఎం కేసీఆర్​ వెంటనే రాజీనామా చేయాలి: ఈటల రాజేందర్

By

Published : Mar 18, 2023, 2:18 PM IST

thumbnail

BJP demands that CM KCR resign: టీఎస్​పీఎస్​సీ పేపర్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహిస్తోందని గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. డీకే అరుణ, ఈటల రాజేందర్, బూర నర్సయ్య గౌడ్, మర్రి శశిధర్‌రె సహా పలువురు నేతలతో కూడిన బృందం గవర్నర్‌ను కలిశారు. 

టీఎస్​పీఎస్​సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పేపర్‌ లికేజీపై అనుమానాలు ఉన్నాయని.. పబ్లిక్​ సర్వీస్​ కమీషన్​లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నించారు. కేసీఆర్‌కు రాజకీయాలు, అధికారంపై ఉన్న ఆసక్తి నిరుద్యోగుల జీవితాలపై లేదని దుయ్యబట్టారు. 

"ప్రభుత్వం ఇవాళ నిద్రలో ఉంది. అందుకే మా పార్టీ తరపున గవర్నర్​ను కలిశాం. గవర్నర్​ జోక్యం చేసుకొని నిరుద్యోగ యువతుకు న్యాయం చేయాలి. దీనిపై సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. పబ్లిక్​ సర్వీస్​ కమిషన్ ఛైర్మన్​తో పాటుగా కమిషన్​​ సభ్యులు కూడా రాజీనామా చేయాలి. నిరుద్యోగులకు రూ. లక్ష రూపాయాలు ఇవ్వాలి."- ఈటల రాజేందర్​, బీజేపీ ఎమ్మెల్యే​

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.