PRATHIDWANI: వెబ్పోర్టళ్లు, సోషల్ మీడియాను నియంత్రించే వ్యవస్థలేవి ?
సోషల్ మీడియా.. సామాన్యుల భావ ప్రకటనకు వేదిక. కానీ నేడవి అడ్డూ అదుపూ లేకుండా తప్పుడు సమాచారాన్ని, వందతులనూ వ్యాప్తి చేస్తున్నాయి. తబ్లీగీ జమాత్ పిటిషన్లపై విచారణ సందర్భంగా సోషల్ మీడియా బాధ్యతా రాహిత్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్యుల అభిప్రాయాలు, గౌరవ మర్యాదలను కాపాడడంలో వెబ్ పోర్టళ్లు, సామాజిక మాధ్యమ వేదికల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది. కోట్లాది మంది ప్రజల మనోభావాలను ప్రభావితం చేస్తున్న ఈ వేదికల నియంత్రణకు ఎలాంటి వ్యవస్థలు ఉన్నాయంటూ ఆరా తీసింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా పెడధోరణులు, వాటి దుష్పరిణామాలు, కట్టడి చర్యలపై ప్రతిధ్వని చర్చ.