PRATHIDWANI: విద్యార్థులను పాఠశాలలకు పంపించాలా.. వద్దా?
సుదీర్ఘ విరామం తర్వాత కరోనా భయాల మధ్యనే తెలంగాణలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. కొవిడ్ నిబంధనలు, మార్గదర్శకాలు కట్టుదిట్టంగా అమలు చేయాలన్న ప్రభుత్వ సూచనలతో సర్కారు బడులు సమాయత్తం అయ్యాయి. ప్రైవేటు పాఠాశాలలు సైతం ప్రత్యక్ష బోధనకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పదిహేను రోజులుగా ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల హాజరు పెంచుకుంటూ, తల్లిదండ్రుల విశ్వాసాన్ని చూరగొనేందుకు పాఠశాలల యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యక్ష బోధన అమలు విధివిధానాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ.