ప్రసాదం బదులు డబ్బులు పంచే గుడి గురించి తెలుసా

By

Published : Oct 25, 2022, 6:41 PM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

thumbnail

మహారాష్ట్రలోని ఓ కాళీమాతా ఆలయంలో భక్తులకు ప్రసాదం రూపంలో డబ్బులు పంచారు. అమరావతిలోని ఆలయంలో దీపావళి రోజున భక్తులకు డబ్బులు పంచితే మంచిదని, అందుకే ఇలా చేసినట్లు అక్కడి పూజారి శక్తి మహారాజ్​ తెలిపారు. 1984లో తానే ఈ ఆచారం ప్రారంభించినట్లు పూజారి వెల్లడించారు. కాళీమాతా ఆశీర్వాదం వల్లనే తాను ఇలా చేయగలుగుతున్నానని ఈటీవీ భారత్​కు తెలిపారు. సోమవారం రాత్రి 11 నుంచి 2 గంటల వరకు పది రూపాయల నోట్లను పెద్ద గిన్నెలో ఉంచి ఒక్కొక్కరికీ రెండు, మూడు నోట్లు ఇచ్చారు. కాళీమాతను దర్శనం చేసుకుని ప్రసాదం పొందడానికి అనేక మంది భక్తులు తరలివచ్చారు.

Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.