ETV Bharat / sukhibhava

ఈ వంటింటి చిట్కాతో కిడ్నీలో రాళ్ల సమస్యకు చెక్​!

author img

By

Published : Nov 12, 2021, 7:13 PM IST

కిడ్నీలో రాళ్లు ఏర్పడితే వచ్చే సమస్యలు అన్నీఇన్నీ కావు. ఒంట్లో నీరు తగ్గడం, అపథ్య ఆహారం, మూత్ర ఇన్​ఫెక్షన్ల వంటి కారణాలతో వచ్చే ఈ రాళ్లు శరీరాన్ని ఎంతో ఇబ్బంది పెడుతుంటాయి. అయితే కేవలం ఈ వంటింటి చిట్కాతో (Kidney Stone Removal Food) ఈ సమస్యను దూరం చేయచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అదేంటో తెలుసుకుందామా..

health tips
ఈ వంటింటి చిట్కాతో కిడ్నీలో రాళ్ల సమస్యకు చెక్​!

వివిధ కారణాల వల్ల కిడ్నీలో ఏర్పడే రాళ్లకు ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం (Kidney Stone Removal Food) ఉందంటున్నారు ఆరోగ్య నిపుణలు. మునగాకుతో తయారు చేసిన (Kidney Stone Removal Food) ఈ పథ్యాహారాన్ని తీసుకుంటే కొద్ది రోజుల్లోనే కిడ్నీలో రాళ్ల సమస్యకు చెక్​ పెట్టొచ్చు అని చెబుతున్నారు.

కావాల్సిన పదార్థాలు - మునగాకులు, నెయ్యి, పెరుగుమీద ఉండే నీరు, ఉప్పు

తయారీ విధానం -

ముందుగా మునగానుకు (Kidney Stone Removal Food) శుభ్రంగా కడిగేసి దానిని ఒక ముద్దలాగా నూరుకోవాలి. స్టవ్ ​మీద ప్యాన్​ పెట్టి అందులో చెంచాడు నెయ్యి వేసి కరిగించాలి. ఇందులో ఇప్పుడు రెండు చెంచాల మునగాకు పేస్ట్​ను వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ఓ గ్లాసు నీళ్లు పోయాలి. కాసేపు మరిగించాక వడపోస్తే మునగాకు కషాయం సిద్ధం అవుతుంది. ఇది చల్లారాక ఇందులో పెరుగు మీద తేటను కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే ఔషధం రెడీ.

అరకప్పు మునగాకు కషాయం, అరకప్పు పెరుగు మీద తేటను కలుపుకుని.. ఈ ఔషధాన్ని కొద్ది రోజుల పాటు ఉదయం, సాయంత్రం తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుంది. ఈ కషాయాన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకుని గోరు వెచ్చగానే తీసుకోవాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ మునగాకు కీళ్లనొప్పులు ఉన్న వారికి కూడా ఉపయోగపడుతుంది. నొప్పులు తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఇదీ చూడండి : మునగాకు దోశలతో కీళ్ల నొప్పులకు చెక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.