Woman Protest: తన భూమి వేరేవారికి పట్టా చేశారంటూ మహిళ హల్‌చల్..

author img

By

Published : Sep 13, 2021, 6:22 PM IST

Updated : Sep 13, 2021, 7:01 PM IST

Woman Protest for land issues, Woman Protest at collectorate

తన భూమిని వేరే వారి పేరు మీద పట్టా చేశారంటూ ఓ మహిళ ఆందోళన యాదాద్రి జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా పారుపల్లి గ్రామానికి చెందిన ఆమె... అధికారులు తనకు అన్యాయం చేశారంటూ వాపోయింది. కోర్టుకు పోయి తేల్చుకునే స్తోమత లేదంటూ జిల్లా అధికారులకు మొరపెట్టుకుంది.

తన భూమిని వేరే వారి పేరు మీద పట్టా చేశారంటూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పారుపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ కలెక్టరేట్‌లో హల్‌చల్ చేసింది. ముత్తమ్మ అనే మహిళ ప్రజావాణిలో భాగంగా కలెక్టర్‌కి ఫిర్యాదు చేయడానికి వచ్చారు. తన భూమిని ఇతరులు పట్టా చేసుకున్నారని... భూమి తనకు ఇప్పించాలని కలెక్టర్‌ ఎదుట ఆందోళనకు దిగింది.

ప్రభుత్వం గతంలో తనకు ముప్పై గుంటల భూమి ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్‌కి ఫిర్యాదు చేస్తే.. కోర్టులో తేల్చుకోమని అంటున్నారని ఆ మహిళ వాపోయింది. తనకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్‌ ఎదుట హల్‌చల్ చేస్తున్న ఆమెను పోలీసులు సముదాయించారు. తనకు కోర్టుకు పోయే స్తోమత లేదని... అధికారులు అన్యాయం చేశారని బోరుమంది.

కలెక్టరేట్ ఎదుట మహిళ హల్‌చ

ఇదీ చదవండి: CM KCR REVIEW: దళితబంధు అమలుపై కేసీఆర్ సమీక్ష... సీఎల్పీ నేత భట్టి హాజరు

Last Updated :Sep 13, 2021, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.