ETV Bharat / state

ఏం ముఖం పెట్టుకుని మునుగోడులో ఓట్లు అడుగుతారు: హరీశ్‌రావు

author img

By

Published : Oct 20, 2022, 6:07 PM IST

Minister Harish Rao tweet
మంత్రి హరీశ్​రావు ట్వీట్​

Harish Rao tweet on JP Nadda: 2016లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుత భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మంత్రి హరీశ్​రావు ట్విటర్​ వేదికగా నిలదీశారు. ఆరేళ్లయినా కేంద్రం ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్​కు నయా పైసా ఇవ్వలేదని అగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పడం ఖాయమని తెలిపారు.

Harish Rao tweet on JP Nadda: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై రాష్ట్ర మంత్రి హరీశ్​రావు ట్విటర్​ వేదికగా మండిపడ్డారు. 2016లో మీరిచ్చిన హామీలు ఏమయ్యాయని ట్విటర్​ వేదికగా నిలదీశారు. మర్రిగూడలో 2016లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న మీరు పర్యటిస్తూ ఫ్లోరైడ్‌ రీసెర్చ్‌ అండ్ మిటిగేషన్​ సెంటర్​ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. హామీ ఇచ్చి ఆరేళ్లయిందని...ఈ సెంటర్ ఏర్పాటు కోసం 8.2ఎకరాల స్థలం చౌటుప్పల్‌లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు.

  • ఆరేళ్లయినా కేంద్రం ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ కు నయా పైసా ఇవ్వలేదు.మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి నిర్మిస్తమని కూడా హమీ ఇచ్చారు.అబద్దపు హమీలిస్తూ,ప్రజా గోడు పట్టని బీజేపీ నేతల్లారా ఏం మోహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నరు. ఈ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ది చెప్పడం ఖాయం 2/2

    — Harish Rao Thanneeru (@trsharish) October 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆరేళ్లయినా కేంద్రం ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్​కు నయా పైసా ఇవ్వలేదని అగ్రహం వ్యక్తం చేశారు. మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చారని... అబద్ధపు హామీలిస్తూ, ప్రజా గోడు పట్టని భాజపా నేతల్లారా ఏం మోహం పెట్టుకుని ఓట్లడగడానికి మునుగోడుకు వస్తున్నారని నిలదీశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పడం ఖాయమని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.