ETV Bharat / state

యాదగిరిగుట్టలో ఘనంగా లక్ష దీపోత్సవం

author img

By

Published : Dec 11, 2020, 1:06 PM IST

కార్తికమాసాన్ని పురస్కరించుకుని యాదగిరిగుట్టలో అయ్యప్ప సేవా సమాజ్​ ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం నిర్వహించారు. యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయ పునర్మిర్మాణం వల్ల కొండకింద ఉన్న లోటస్​ టెంపుల్​లో కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Laksha Dipotsavam is celebrated in Yadagirigutta in yadadri bhuvanagiri dist
యాదగిరిగుట్టలో ఘనంగా లక్ష దీపోత్సవం

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో అయ్యప్ప సేవా సమాజ్​ ఆధ్వర్యంలో కార్తికమాసం సందర్భంగా లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని చేపట్టారు. యాదాద్రి ఆలయ పునర్మిర్మాణం వల్ల స్వామివారి వైకుంఠ ద్వారం, కొండకింద ఉన్న ఉన్నత పాఠశాల​ ప్రాంగణం, లోటస్​ టెంపుల్​లో కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్తిక మాసాన్ని పురస్కరించుకుని మూడేళ్లుగా దీపోత్సవాన్ని చేపడుతున్నామని అయ్యప్ప సేవ సమాజ్​ సభ్యులు వెల్లడించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట పురపాలక ఛైర్మన్ ఎరుకల సుధా, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, హేమేందర్​, లోటస్​ టెంపుల్ ఛైర్మన్ బాలరాజు, సినీనటుడు లక్ష్మీ నారాయణ, పెండం శ్రీనివాస్, గురుస్వామి పాల్గొన్నారు.

ఇదీ చూడండి:భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో అయ్యప్ప సేవా సమాజ్​ ఆధ్వర్యంలో కార్తికమాసం సందర్భంగా లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని చేపట్టారు. యాదాద్రి ఆలయ పునర్మిర్మాణం వల్ల స్వామివారి వైకుంఠ ద్వారం, కొండకింద ఉన్న ఉన్నత పాఠశాల​ ప్రాంగణం, లోటస్​ టెంపుల్​లో కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్తిక మాసాన్ని పురస్కరించుకుని మూడేళ్లుగా దీపోత్సవాన్ని చేపడుతున్నామని అయ్యప్ప సేవ సమాజ్​ సభ్యులు వెల్లడించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట పురపాలక ఛైర్మన్ ఎరుకల సుధా, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, హేమేందర్​, లోటస్​ టెంపుల్ ఛైర్మన్ బాలరాజు, సినీనటుడు లక్ష్మీ నారాయణ, పెండం శ్రీనివాస్, గురుస్వామి పాల్గొన్నారు.

ఇదీ చూడండి:భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.