ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనితా రామచంద్రన్, డీసీపీ నారాయణ పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రారంభించి పాత బస్టాండ్.. అటు నుంచి కళాశాల ప్రాంగణం వరకు నిర్వహించారు.
జిల్లాకు చెందిన పర్వతారోహకురాలు అన్వితా రెడ్డికి కలెక్టర్ అనిత రామచంద్రన్ శాలువా కప్పి జ్ఞాపిక అందజేశారు. అన్వితా రెడ్డిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. స్వాతంత్య్రోద్యమం గురించి పిల్లలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, క్రీడాకారులు, యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పాలేరు నుంచి బరిలో దిగుతా.. ఖమ్మం నేతలతో షర్మిల