వరంగల్ అర్బన్ జిల్లా శంభునిపేటలో దారుణం జరిగింది. రాజు అనే కూలిని భార్య గొడ్డలితో నరికి చంపింది. మద్యానికి బానిసైన రాజు... రోజూ భార్యతో గొడవ పడేవాడు. రోజూలాగే మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాజు... భార్యతో ఘర్షణకు దిగాడు. సహనం కోల్పోయిన భార్య... పక్కనే ఉన్న గొడ్డలితో భర్తపై దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ రాజు... అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ఇవీచూడండి: వేధిస్తున్నాడని భర్తని చంపిన భార్య