ETV Bharat / state

kishan reddy : హుజూరాబాద్ తీర్పు.. రాష్ట్రంలో అధికార మార్పునకు సంకేతం కాబోతోంది

author img

By

Published : Oct 23, 2021, 10:22 AM IST

Updated : Oct 23, 2021, 11:44 AM IST

రాష్ట్రంలో తెరాస కుటుంబపాలన(kishan reddy About Huzurabad by poll) పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి అన్నారు. హుజూరాబాద్‌(Huzurabad By Election)లో భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు.

kishan reddy About Huzurabad by poll, kishan reddy fires on trs
తెరాసపై కిషన్ రెడ్డి విమర్శలు, హుజూరాబాద్ ఎన్నికలపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు

హుజూరాబాద్​లో భాజపా గెలుపు ఖాయం

తెరాస ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా.. అసత్య ప్రచారాలు చేసినా హుజూరాబాద్‌లో భాజపా విజయం సాధిస్తుందని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి(kishan reddy About Huzurabad by poll) ధీమా వ్యక్తం చేశారు. తెరాస కుటుంబ పాలన పోవాలని హుజురాబాద్(Huzurabad by elections 2021) ప్రజలు కోరుకుంటున్నారని హనుమకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. దశల వారీగా తెరాస డబ్బులు పంచుతోందని ఆరోపించిన కిషన్‌ రెడ్డి... భాజపా గెలుపునకు సంబంధించి ఎంత మెజారిటీ అన్నదే చూస్తున్నామని చెప్పారు. భాజపా గెలుపుతో రాష్ట్రంలో అధికార మార్పుకు మరో అడుగు పడుతుందని వెల్లడించారు. ఈసీ అనుమతి తీసుకొని ఎన్నికల ప్రచారం చేస్తే అడ్డుకోవడాన్ని ఖండించిన కేంద్రమంత్రి... హుజురాబాద్‌లో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు.

అధికార దుర్వినియోగం

హుజూరాబాద్‌లో అధికార దుర్వినియోగం జరుగుతోందని ఆయన(kishan reddy About Huzurabad by poll) ఆరోపించారు. తెరాస నేతలు ముందే ఓటమిని గ్రహించి... దశలవారీగా డబ్బులు పంచుతున్నారని అన్నారు. హుజూరాబాద్ కంటే ప్లీనరీ గొప్పదని తెరాస చెబుతోందన్న మంత్రి... తెరాస వచ్చాకే ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బుల ఖర్చు చేస్తున్నారని తెలిపారు. కేంద్ర పథకాలను ఆపే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అభిప్రాయపడ్డారు. కుటుంబపాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

హుజూరాబాద్ ఉపఎన్నికల్లో భాగంగా వివిధ గ్రామాల్లో పర్యటించాం. అక్కడి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. భాజపా అనుకూల స్పందన చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తెరాస ఎన్ని రకాలుగా అధికార దుర్వినియోగం చేసినా.. ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసినా హుజూరాబాద్​లో భాజపా గెలవడం తథ్యం. హుజూరాబాద్ ఉపఎన్నికల కన్నా పార్టీ ప్లీనరీ ముఖ్యమని తెరాస వైఖరి చూపిస్తోంది. ప్రజలు చాలా స్పష్టంగా భాజపా గెలవాలని కోరుకుంటున్నారు. కుటుంబపాలన పోవాలని కోరుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో తెరాస జెండా పట్టుకొని... ఈటలకు మద్దతిస్తున్న సంఘటనలు ఉన్నాయి. మమతా బెనర్జీ, అనేక ముఖ్యమంత్రులు పోటీ చేసిన ఉపఎన్నికలు చూశాం. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఎన్నికలు చూశాం. దేశంలో ఏ ఎన్నికల్లోనూ ఈ రకంగా అధికారం దుర్వినియోగం చేసినట్లు ఎక్కడా చూడలేదు.

-కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి

హుజూరాబాద్​లో ప్రచారం

హుజూరాబాద్​ నియోజకవర్గంలోని బూజునూరులో ఈటలతో కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ప్రచారం చేశారు. గ్రామాల్లోని ఓటర్లను కలుసుకున్నారు. దళితబంధుపై తెరాస అసత్య ప్రచారాలు చేస్తోందని కిషన్ ఆరోపించారు. కిషన్ రెడ్డితో కలిసి ప్రచారం చేసిన ఈటల రాజేందర్​... దళితబంధు మీద కలెక్టర్లు, బ్యాంకుల పెత్తనం కాకుండా... లబ్ధిదారులకే ఉండాలని ఈటల డిమాండ్ చేశారు. ఎన్నికలైన మరుసటి రోజే... రాష్ట్రంలోని ఎస్సీలందరికీ దళితబంధు అమలు చేస్తారా? ప్రతి దళితునికి రూ.10 లక్షలు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్‌తో భాజపా పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. తెరాసనే కాంగ్రెస్​తో కలిసి పొత్తు పెట్టుకుంటుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో అబద్ధాలు మీద అబద్ధాలు ఆడటం కేసీఆర్ కుటుంబానికే చెల్లుతుందని ఆరోపించారు.

ఇదీ చదవండి: Huzurabad by election 2021 : హుజూరాబాద్​లో వారెంత చెబితే అంతివ్వడమేనట!

Last Updated : Oct 23, 2021, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.