ETV Bharat / state

KU students protest: కేయూలో విద్యార్థుల ఆందోళన.. వీసీ ఆదేశాలపై ఆగ్రహం

author img

By

Published : Feb 26, 2022, 6:40 PM IST

KU students protest: కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి పరిపాలన భవనం ముందు నిరసన చేపట్టారు. సెల్ఫ్ ఫైనాన్స్​ కోర్సులు చదువుతున్న వారిని వసతిగృహాలు ఖాళీ చేయాలని ఆదేశించడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

KU students protest
కేయూలో విద్యార్థుల ఆందోళన

KU students protest: వరంగల్​లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు పెద్దఎత్తున ధర్నాకు దిగారు. వర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు చదువుతున్న విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కేయూలో వసతి కల్పించాలని కోరుతూ పరిపాలన భవనం ఎదుట విద్యార్థి సంఘాలతో కలిసి నిరసన తెలిపారు.

వసతి గృహాలు ఖాళీ చేయాలని వీసీ ఆదేశం..

వచ్చే నెల ఐదో తేదీ లోపు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు చదువుతున్న విద్యార్థులు వసతి గృహలను ఖాళీ చేయాలని కేయూ ఉపకులపతి ఆచార్య రమేష్ ఆదేశించారు. దీంతో భగ్గుమన్న విద్యార్థులు నిరసనకు దిగారు. తమకు హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. వీరికి పలు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. కేయూ అధికారులకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కేయూ అధికారులు వసతి కల్పిస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

కేయూలో విద్యార్థుల ఆందోళన

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.