ETV Bharat / state

మునుగోడులో TRS పేరుతోనే పోటీ.. క్లారిటీ ఇచ్చిన నేతలు

author img

By

Published : Oct 6, 2022, 3:49 PM IST

Updated : Oct 6, 2022, 4:59 PM IST

munugode
munugode

munugode by poll: మునుగోడు ఉపఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోనే ప్రచారంలోకి వెళ్తున్నట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. దిల్లీలోని సీఈసీని కలిసిన తెరాస నేతలు.. రాబోయే మునుగోడు ఉపఎన్నికలో 'కారు' గుర్తుతోనే పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

munugode by poll: మునుగోడు ఉపఎన్నికలో 'కారు' గుర్తుతోనే పోటి చేస్తున్నట్లు తెరాస నేతలు పేర్కొన్నారు. దిల్లీలో సీఈసీని కలిసిన ఆ పార్టీ నేతలు తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్​ రాష్ట్ర సమితిగా గుర్తింపు పొందడానికి కొంత సమయం పడుతుందని వివరించారు. అందుకే మునుగోడు ఉపఎన్నికలో తెరాస పేరుతోనే ప్రచారంలోకి వెళ్తున్నట్లు వారు ప్రకటించారు.

రేపటి నుంచే మునుగోడులో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. వ్యక్తి పేరు మార్చినట్లే పార్టీ పేరు మార్చామని.. మిగతావన్నీ యథాతథంగా ఉంటాయని వారు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Oct 6, 2022, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.