వరంగల్లోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ నిత్యం రద్దీగా ఉంటుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ యార్డులో రద్దీ పెరగకుండా... అధికారులు మార్కెట్ను అజంజాహీ మిల్లు గ్రౌండ్కు మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మార్కెట్కు వచ్చేవారు సామాజిక దూరం పాటించేందుకు వీలుగా ఈ మైదానం ఉంటుందని వరంగల్ తూర్పు శాసనసభ్యులు నరేందర్ పేర్కొన్నారు.
మార్కెట్ యార్డును రేపటి నుంచే మైదానంలోకి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. వ్యాపారస్తులకు ఇప్పటికే సూచించినట్లు పేర్కొన్నారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది సోడియం హైపోక్లోరైట్ మిశ్రమాన్ని మార్కెట్ ఆవరణలో పిచికారీ చేశారు.
ఇవీ చూడండి: పల్లెటూళ్లకు సత్వర న్యాయం.. గ్రామ న్యాయాలయం