ETV Bharat / state

ICICI Bank Deputy Manager Gold Fraud : బ్యాంకు డిప్యూటీ మేనేజర్​ చేతివాటం.. రూ.8.65 కోట్లు స్వాహా

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2023, 3:34 PM IST

Updated : Sep 12, 2023, 7:51 PM IST

ICICI Bank Deputy Manager Fraud gold
ICICI Bank Deputy Manager Fraud

15:24 September 12

ICICI Bank Deputy Manager Gold Fraud : బ్యాంకును బురిడీ కొట్టించి.. రూ.8.65 కోట్ల స్వాహా

ICICI Bank Deputy Manager Gold Fraud : వరంగల్​ జిల్లాలోని నర్సంపేట ఐసీఐసీఐ బ్యాంకులో ఈ ఘరానా మోసం జరిగింది. బ్యాంకును బురిడీ కొట్టించి ఏకంగా రూ.8.65 కోట్ల సొమ్మును ఐసీఐసీఐ బ్యాంకు(ICICI Bank) డిప్యూటీ మేనేజర్ బైరిశెట్టి కార్తీక్​​ దారి మళ్లించాడు. నర్సంపేట బ్రాంచ్​లోని ఖాతాదారులు బంగారు రుణాలు పొందినట్లు రికార్డులు సృష్టించి.. రూ.8.65 కోట్లను దోచుకున్నాడు. 128 మంది ఖాతాదారులు రుణాలు పొందినట్లు రికార్డులు సృష్టించినట్లు.. ఆడిటింగ్​లో మోసాన్ని గుర్తించి బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్తీక్​పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. నిందితుడిని పోలీసులు రిమాండ్​కు తరలించారు. ఇలా కొల్లగొట్టిన సొమ్మును క్రికెట్​ బెట్టింగ్​(Cricket Betting)లో పోగొట్టుకున్నట్లు కార్తీక్​.. పోలీసులకు తెలిపాడు. ఈ స్కాంతో ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేవని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్​ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకులో బైరిశెట్టి కార్తీక్​ గోల్డ్​లోన్ సెక్షన్​లో డిప్యూటీ మేనేజర్​గా పని చేస్తున్నారు. ఆయన గోల్డ్​లోన్​, రెన్సువల్స్​, క్లోజింగ్ చూసుకుంటాడు. ఈ క్రమంలో కార్తీక్ బెట్టింగుల్లో కోట్ల రూపాయలను పోగొట్టుకున్నాడు. ఆ డబ్బును ఎలా తీర్చాలో తెలియక.. బ్యాంకును మోసం చేయాలని చూశాడు. అందులో భాగంగా 128 మంది ఖాతాదారుల పేరిట బంగారం రుణాలు పొందినట్లు రికార్డులు సృష్టించి.. ఏకంగా రూ.8.65 కోట్ల రూపాయలను దారి మళ్లించాడు.

Rs.8.65 Crores Money Fraud Case : బంగారం రుణ ఖాతాదారులు లోన్ తీర్చిందుకు వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని వారి బంగారం తిరిగి ఇచ్చేవాడు. అయితే లోన్ అకౌంట్ క్లోజ్ చేసేవాడు కాదు. ఆయా ఖాతాల్లో నెలనెల వడ్డీ జమచేసేవాడు. ఖాతాదారుల డబ్బులు తన బినామీ ఖాతాలో వేసుకునేవాడు. దీంతో ఖాతాదారులు ఎవరు ఫిర్యాదు చేయలేదు. బ్యాంకులో గోల్డ్ ఖాతా ఇంకా చెలామణిలోనే ఉన్నట్లు చూపించడంతో ఎవరికీ అనుమానం రాలేదు. ఆ తరువాత నకిలీ ఇన్​వాయిస్​లు సృష్టించి, ఇతర సిబ్బంది సంతకాలను ఫోర్జరీ చేసి.. దాదాపు రూ.8.65 కోట్లను దోచుకున్నాడు.

Warangal Thefts 2023 : వీళ్లు మామూలు దొంగలు కాదు బాబోయ్.. ఒకేరోజు 5 అపార్ట్‌మెంట్లలో చోరీ.. 105 తులాల బంగారం అపహరణ

Gold Fraud Case in Warangal : అయితే గత ఏడాది ఆగస్టు 14న బ్యాంకు అడిటింగ్​ అధికారులు ఖాతాలను చెక్​ చేయడంతో.. రూ.8.65 కోట్ల మేర అవకతవకలు జరిగాయని గుర్తించారు. ఈమేరకు బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో చేపట్టిన దర్యాప్తులో డిప్యూటీ మేనేజర్​ కార్తీక్​ చేసిన మోసాలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన కార్తీక్ పారిపోయాడు. ఇన్నాళ్లు వెతికిన పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకొని.. విచారించగా బ్యాంకులో చేసిన మోసాల చిట్టా విప్పాడు.

CID Arrested Couple in Co Operative Bank Case : సహకార బ్యాంకులో మోసం.. 14 ఏళ్ల తరువాత పరారీలో ఉన్న దంపతుల అరెస్టు.. ఎలా దొరికారంటే..

Warangal Fraud Case : 2019 నుంచి 2023 ఆగస్టు వరకు నర్సంపేట ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచిలో రూ.8.65 కోట్ల బ్యాంకు మోసానికి పాల్పడ్డాడు. మొత్తం 128 మంది ఖాతాదారులను వాడుకొని.. ఆ డబ్బును ఆన్​లైన్​ క్రికెట్​ బెట్టింగ్​లలో పెట్టి పోగొట్టుకున్నాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇందులో ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేవని.. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు. బైరిశెట్టి కార్తీక్​ను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది.

Fake Baba Social Service Fraud Hyderabad : సేవ ముసుగులో లూటీ.. మూడేళ్లుగా పరారీలో ఉన్న మోసగాడి అరెస్టు

Warangal Thefts 2023 : వీళ్లు మామూలు దొంగలు కాదు బాబోయ్.. ఒకేరోజు 5 అపార్ట్‌మెంట్లలో చోరీ.. 105 తులాల బంగారం అపహరణ

Last Updated :Sep 12, 2023, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.