ETV Bharat / state

ప్రతి ఇంటికి నల్లా నీరు సరఫరా చేసేందుకు చర్యలు : గుండా ప్రకాశ్​

author img

By

Published : Jan 31, 2021, 9:28 AM IST

వరంగల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని మేయర్​ గుండా ప్రకాశ్​ అన్నారు. హన్మకొండలోని అంబేడ్కర్​ భవన్​లోగ గ్రేటర్ వరంగల్​ కౌన్సిల్​ సమావేశం నిర్వహించారు.

greater warangal corporation meeting conducted in hanmakonda
వరంగల్​ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మేయర్ గుండా ప్రకాశ్​

ఉగాది నుంచి ప్రతి ఇంటికి నల్లా నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్​ మేయర్​ గుండా ప్రకాశ్​ తెలిపారు. హన్మకొండలోని అంబేడ్కర్​ భవన్​లో గ్రేటర్​ వరంగల్​ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రూ.155.53 కోట్ల పనులకు ఆమోదం లభించింది.

గ్రేటర్ వరంగల్‌ అభివృద్ధే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నామని అన్నారు. పారిశుద్ధ్యం మెరుగుపర్చడానికి 270 యంత్రాలను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో 38 కూడళ్లను అధునాతన హంగులతో గ్రీనరీలుగా తీర్చి దిద్దుతున్నట్లు వెల్లడించారు. ప్రతి కార్పొరేటర్ వారివారి డివిజన్లలో సత్వర అభివృద్ధికి రూ.27 లక్షల పనులను నామినేషన్ పద్ధతిన కేటాయించినట్లు మేయర్​ తెలిపారు.

ఇదీ చూడండి : డైరీ ఆవిష్కరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.