వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళన చేపట్టారు. మిర్చికి మద్దతు ధర కల్పించాలంటూ డిమాండ్ చేశారు. మిర్చి ధర ఒక్కసారిగా పడిపోవడం వల్ల రైతులు మిర్చి యార్డు కార్యాలయాన్ని ముట్టడించారు.
రైతుల ఆందోళనతో అప్రమత్తమైన పోలీసులు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం రైతులతో పోలీసులు, మార్కెట్ అధికారులు చర్చలు జరిపారు.
ఇదీ చూడండి: 'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్ పిటిషన్