ETV Bharat / state

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​కు పోటెత్తిన మిర్చి రైతులు

author img

By

Published : Feb 22, 2021, 3:49 PM IST

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​కు మిర్చి రైతులు పోటెత్తారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి రావడంతో మార్కెట్ యార్డ్ మొత్తం మిర్చి బస్తాలతో కళకళలాడింది. 2 రోజులు సెలవుల అనంతరం మార్కెట్ తిరిగి ప్రారంభం కావడంతో పెద్ద మొత్తంలో వచ్చినట్లు అధికారులు తెలిపారు.

farmers Gathered to the Enumamula Agricultural Market in Warangal district
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​కు పోటెత్తిన మిర్చి రైతులు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​కు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి మిర్చి విక్రయించేందుకు రైతులు వస్తుంటారు. 2 రోజుల సెలవుల అనంతరం మార్కెట్ తిరిగి ప్రారంభం కావడంతో మిర్చి బస్తాలతో కళకళలాడింది.

మార్కెట్​లో తేజ రకం మిర్చి ధర రూ.13,651 పలికిందని అధికారులు తెలిపారు. వండర్ హాట్ ధర రూ.15,900, డీడీ రకం మిరప రూ.13,400 ఉన్నట్లు పేర్కొన్నారు. కొన్ని రోజులుగా మిర్చి ధరలు పడిపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఇదీ చదవండి: హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసు విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.