ETV Bharat / state

Greater warangal: ఎక్కడి సమస్యలు అక్కడే.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

author img

By

Published : Aug 16, 2021, 5:22 PM IST

వరంగల్​ బల్దియా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో రసాభాస చోటుచేసుకుంది. గ్రేటర్​లో సమస్యలపై స్థానికుల నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అధికారులు, ఫిర్యాదుదారులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

Greater warangal prajavani
వరంగల్​లో ప్రజావాణి

వరంగల్ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజావాణి రసాభాసగా మారింది. గ్రేటర్ పరిధిలో నెలకొన్న సమస్యలపై అర్జీ పెట్టినప్పటికీ సమస్య మాత్రం తీరడం లేదంటూ నగరవాసులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పరిధిలో కోతులు, కుక్కలు, పందుల బెడద ఎక్కువగా ఉందని పలు కాలనీలకు చెందిన కాలనీవాసులు అర్జీ పెట్టుకున్నారు. బేస్తం చెరువు చిన్న వడ్డేపల్లి చెరువు అన్యాక్రాంతం అవుతున్నట్లు భూ పరిరక్షణ సమితికి చెందిన కమిటీ సభ్యులు.. అదనపు మున్సిపల్​ కమిషనర్​ నాగేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు.

రంగ సాయి పేట గణేష్ నగర్​లో బిల్డర్ల అక్రమ నిర్మాణాల జోరు పెరిగిందని అదే కాలనీకి చెందిన కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. నాలా పూడికతీత వేగం పెంచాలంటూ శివనగర్ ముంపు ప్రాంతాలకు చెందిన కాలనీవాసులు అదనపు కమిషనర్​కు ఫిర్యాదు చేశారు. వరంగల్​ మున్సిపల్​ కమిషనర్ లేకపోవడంతో నగరంలో సమస్యలు ఎక్కడివక్కడ పేరుకుపోయాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

నగరంలో నెలకొన్న సమస్యలపై ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరంగల్​ అతలాకుతలమైందని వాపోయారు. ఈ క్రమంలో అధికారులు, ఫిర్యాదుదారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇదీ చదవండి: నిలువురాళ్లు ప్రాంతానికి యునెస్కో గుర్తింపు కోసం కృషి చేయాలి: టీటా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.