ETV Bharat / state

సివిల్స్​లో మెరిసిన హన్మకొండ యువకులు

author img

By

Published : Aug 5, 2020, 5:10 AM IST

దేశంలో అత్యున్నత సర్వీస్‌గా భావించే... సివిల్స్ ఫలితాల్లో వరంగల్​ యువకులు సత్తా చాటారు. అద్భుతమైన ప్రతిభతో మంచి ర్యాంకులు సాధించారు. హన్మకొండకు చెందిన సాయితేజ 344 ర్యాంకు సాధించగా... పోస్టల్​ కాలనీకి చెందిన స్మృతిక్​ 466వ ర్యాంక్​ సాధించారు.

civil-rankers-in-warangal-city
సివిల్స్​లో మెరిసిన హన్మకొండ యువకులు

సివిల్స్ ఫలితాల్లో వరంగల్​ యువకులు సత్తా చాటారు. హన్మకొండలోని సహకర్ నగర్​కు చెందిన సాయి తేజ 344 ర్యాంకు సాధించగా.. పోస్టల్ కాలనీకి చెందిన స్మృతిక్ 466వ ర్యాంక్​ సాధించారు. సాయి తేజ హన్మకొండలో పదో తరగతి వరకూ చదవగా... హైదరాబాద్​లో ఇంటర్ విద్య పూర్తి చేసి ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్​ను అభ్యసించాడు. ఐఐటీ చివరి సంవత్సరం నుంచి సివిల్స్ ప్రిపేర్ అయినట్లు సాయితేజ తెలిపారు. ఆయనకు చిన్నతనం నుంచి సివిల్స్ అంటే ఆసక్తి ఉండటం వల్ల తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ర్యాంకు సాధించినట్లు సాయి తేజ వివరించారు. 466వ ర్యాంకు సాధించిన స్మృతిక్ ప్రస్తుతం భూపాల్ సెంట్రల్ ఆర్మూర్ ఫోర్స్​లో అసిస్టెంట్ కమాండెంట్​గా పని చేస్తున్నారు.

ఇవీ చూడండి: సివిల్స్​ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు.. 36 మంది ఎంపిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.