ప్రజల ఇబ్బందులు చూడలేకే సొంత ఖర్చులతో అంబులెన్స్ను కొనుగోలు చేశానని ఎంపీపీ సోమేశ్వరమ్మ తెలిపారు. వనపర్తి జిల్లా చిన్నంబాయి మండల కేంద్రంలోని పీహెచ్సీకి రూ.10 లక్షలు వెచ్చించి అంబులెన్స్ను అందించారు. ఎంపీపీ దాతృత్వానికి మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నూతన వాహనాన్ని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
ప్రజాప్రతినిధులు ప్రతిఒక్కరూ మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం కొల్లాపూర్లో క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ కానుకలను ఆయన పంపీణీ చేశారు. అర్హులైన వారికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి యాస్మిన్ భాష, జడ్పీ ఛైర్మన్ లోకనాథ్రెడ్డి, జడ్పీటీసీ వెంకటరమణ, శ్రీనివాసులు పాల్గొన్నారు.