వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హాజరయ్యారు. ప్రజాప్రతినిధులందరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలపై అవగాహన ఉండాలని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. అప్పుడే పథకాల అమలు, పనితీరుపై ప్రజలకు చెప్పే అవకాశముంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మూడు నెలలకోసారి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహిస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. అందులో ప్రజాప్రతినిధులు అందరూ హాజరై ప్రభుత్వ పథకాల అమలు తీరును వివరించాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో షేక్ యాస్మిన్ బాషా, జడ్పీ ఛైర్మన్ లోక్నాథ్రెడ్డి, తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.