వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాల సమీపంలో ఉన్న కృష్ణవేణి చక్కెర కర్మాగారంలో హరితహారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, అదనపు కలెక్టర్ శ్రీ వాత్సవా కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి.. వాటిని సంరక్షించే బాధ్యతను స్వీకరించాలని కలెక్టర్ కోరారు.
ఇప్పుడు మొక్కలు నాటితే రేపటి తరానికి కాలుష్య రహిత పర్యావరణాన్ని అందించినవారం అవుతామని.. కాబట్టి ప్రజలందరూ తమ ఇళ్లల్లో మొక్కలు నాటాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ మౌనిక, జడ్పీ వైస్ ఛైర్మన్ వామన్గౌడ్, ఎంపీడీవో శ్రీ వాత్సవ, తహసీల్దార్ రమేష్ రెడ్డి, చక్కెర కంపెనీ డైరెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్