ETV Bharat / state

'పూజించనవసరం లేదు... గౌరవిస్తే చాలు'

author img

By

Published : Mar 8, 2020, 6:17 PM IST

collector yasmin basha in women's day celebrations at wanaparthy
'పూజించనవసరం లేదు... గౌరవిస్తే చాలు'

మహిళలను పూజించాల్సిన అవసరం లేదని.. గౌరవిస్తే చాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

వనపర్తి జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా ఈ కార్యక్రమంలో ఎస్పీ అపూర్వతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను వారు సన్మానించి.. ప్రశంసా పత్రాలను అందజేశారు.

'పూజించనవసరం లేదు... గౌరవిస్తే చాలు'

మహిళలు లేనిదే జీవితం లేదని, ప్రతి కుటుంబంలో మహిళల అవసరముందని కలెక్టర్ పేర్కొన్నారు. మహిళలను పూజించనవసరం లేదని.. గౌరవిస్తే చాలని సూచించారు.

ఇవీ చూడండి: శక్తి స్వరూపిణులకు పురస్కారాల ప్రదానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.