ETV Bharat / state

రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌: మంత్రి సబిత

author img

By

Published : Sep 25, 2020, 5:14 PM IST

వికరాబాద్​ జిల్లా పరిగిలో ట్రాక్టర్ల కృతజ్ఞత ర్యాలీని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.

minister sabitha indra reddy talk about cm kcr in parigi rally, vikarabad district
రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌: మంత్రి సబితా

నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్​ రైతు బాంధవుడిగా చరిత్రకెక్కారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలుపుతూ... వికరాబాద్​ జిల్లా పరిగిలో ట్రాక్టర్లతో కృతజ్ఞత ర్యాలీని ప్రారంభించారు.

పరిగి ఎమ్మెల్యే మహేశ్​రెడ్డి, ఎంపీ రంజిత్​రెడ్డిలు ట్రాక్టర్​లు నడుపుతూ.. ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్​వన్​గా తీర్చిదిద్దారని మంత్రి సబిత అన్నారు. నూతన రెవెన్యూ చట్టం వల్ల ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన రైతు సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.