సహకార బ్యాంకు సేవలను రైతులకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లాలో కొత్తగా మూడు శాఖలను ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు.
డీసీసీబీ విస్తరణలో భాగంగా జిల్లాలోని యాలాలా మండలం లక్ష్మీనారాయణపూర్, పూడూరు మండలం మన్నెగూడ, దోమ మండల కేంద్రంలో కొత్త శాఖలను ఏర్పాటు చేయనున్నామని మనోహర్ రెడ్డి తెలిపారు. వాటితో పాటుగా రంగారెడ్డి జిల్లాలో మరో రెండు కొత్త శాఖలను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: శిశువు విక్రయం కేసును ఛేదించిన పోలీసులు