జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కోదాడ పట్టణ క్రీడాకారుల ఆధ్వర్యంలో 2కే రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. కోదాడలో మినీ స్టేడియం ఏర్పాటుచేసి క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం వివిధ క్రీడల్లో రాణించిన క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ సుదర్శన్ రెడ్డి, సీఐ శ్రీనివాసులు రెడ్డి పలువురు తెరాస నాయకులు పాల్గొన్నారు.
'మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరం'
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కోదాడ పట్టణ క్రీడాకారుల ఆధ్వర్యంలో 2కే రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. కోదాడలో మినీ స్టేడియం ఏర్పాటుచేసి క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం వివిధ క్రీడల్లో రాణించిన క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ సుదర్శన్ రెడ్డి, సీఐ శ్రీనివాసులు రెడ్డి పలువురు తెరాస నాయకులు పాల్గొన్నారు.