గిరిజనులతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే... మురిసిన స్థానికులు

author img

By

Published : Sep 18, 2021, 5:26 PM IST

Updated : Sep 18, 2021, 5:36 PM IST

mla dance

సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో గణేశ్​ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్థానిక గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. అనంతరం వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

గిరిజనులతో కలిసి నృత్యం చేసిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని భీక్యా తండలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్థానిక ఆదివాసీలతో కలిసి ​గురువారం రాత్రి వినాయకుడి పూజలో పాల్గొన్నారు. అనంతరం స్థానికుల కోరిక మేరకు వారితో కలిసి ఎమ్మెల్యే నృత్యం చేశారు. ఎమ్మెల్యే డాన్స్ వేయడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఎంపీపీ కవిత, సర్పంచ్ అంబేడ్కర్ తదితరులు పాల్గొన్నారు.

Last Updated :Sep 18, 2021, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.