నిండుకుండలా మారిన మూసీ ప్రాజెక్టు 5వ గేటు కొట్టుకుపోవడం వల్ల నీరంతా దిగువప్రాంతానికి వెళ్లింది. 5వ నంబర్ గేటు ఇటీవల విరిగిపోగా.. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. దీనివల్ల ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటిని ప్రాజెక్టులో నిల్వచేసే పరిస్థితి లేదు. మిగిలిన గేట్లు కూడా బలహీనంగానే ఉండటం వల్ల ప్రాజెక్టులో 35 అడుగుల మేరకే నీటినిల్వను పరిమితం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. తమకు నీరు అందే అవకాశం లేదని ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రాజెక్టులో 45 అడుగుల వరకు నీరు నిల్వ చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. ఖాళీ అయిన మూసీ ప్రాజెక్టును ఎస్సారెస్పీ, ఏఎమ్మార్పీ ద్వారా నింపాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రాజెక్టు డీఈకి వినతి పత్రం అందజేశారు.
- ఇదీ చూడండి : ఐక్యతా విగ్రహానికి అందాలు అద్దిన ముళ్ల పొదలు!