పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యులపై దాడి చేయడాన్ని నిరసిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇండియన్ మెడికల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన చేశారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఇటీవల బెంగాల్ రాష్ట్రంలో ఓ వృద్ధుడి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితుడి బంధువులు అక్కడి డాక్టర్లపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో వైద్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని సమర్థిస్తూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడారంటూ సూర్యాపేట వైద్యులు దుయ్యబట్టారు. తక్షణమే ప్రభుత్వ వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: నిమ్స్లో రెసిడెంట్ వైద్యుల ఆందోళన