ETV Bharat / state

కర్నల్ సంతోష్ బాబు దశదిన కర్మ.. హాజరైన మంత్రి జగదీశ్ రెడ్డి

author img

By

Published : Jun 27, 2020, 10:12 PM IST

colonel santhosh babu
colonel santhosh babu

వీర మరణం పొందిన కర్నల్ సంతోష్ బాబు దశదిన కర్మను సూర్యాపేటలోని ఆయన స్వగ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీశ్ రెడ్డి హాజరై సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

చైనా సరిహద్దు గాల్వన్​ లోయలో వీర మరణం పొందిన కర్నల్ సంతోష్ బాబు దశ దిన కర్మను సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో నిర్వహించారు. బంధువులు భారీగా హాజరయ్యారు.

స్థానిక ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై కర్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సంతోష్ బాబు జ్ఞాపకార్థం.. దశదిన కర్మకు వచ్చిన అతిథులకు భగవద్గీత పుస్తకాలను ప్రదానం చేశారు.

చదవండి: ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠినంగా వ్యవహరిస్తాం: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.