ETV Bharat / state

దుబ్బాకలో వైఎస్​ఆర్​ వర్ధంతి వేడుకలు

author img

By

Published : Sep 2, 2020, 7:22 PM IST

దుబ్బాకలో వైఎస్​ఆర్​ వర్ధంతి వేడుకలు
దుబ్బాకలో వైఎస్​ఆర్​ వర్ధంతి వేడుకలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి వర్ధంతిని సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించారు. కాంగ్రెస్​ నాయకులు స్థానిక బస్టాండ్​ వద్ద వైఎస్​ఆర్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్​ నాయకులు స్థానిక బస్టాండ్​ వద్ద వైఎస్​ఆర్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించారన్నారు. నిరుపేదలకు ఆరోగ్య సేవలందించేందుకు108 వాహనాలను సమకూర్చారని అన్నారు. భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు.

ఇదీ చూడండి : ఆ యాప్​ సాయంతో.. సులభంగా సరకు రవాణా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.