మల్లన్నసాగర్ నుంచి మిషన్ భగీరథకు నీటి విడుదల

author img

By

Published : Apr 10, 2023, 5:33 PM IST

mission bhagiratha trial runs started in mangole

mission bhagiratha trial runs started in mangole: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథలో భాగంగా నీటి పంపిణీని స్థిరీకరించడానికి ఉపయోగపడే ప్రాజెక్టుకు నేడు ట్రయల్ రన్ చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మంగోల్‌ వద్ద రూ.1,212 కోట్లతో నిర్మించిన భారీ రిజర్వాయర్‌ను ప్రారంభించడానికి ముందు ప్లాంట్ పనితీరును పరిశీలించడానికి సోమవారం ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. దీనిని మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్​లు ప్రారంభించారు.

mission bhagiratha trial runs started in mangole: సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్​ జలాశయం నుంచి మిషన్ భగీరథకు నీటిని విడుదల చేశారు. ఈ నీటి విడుదల ట్రయల్​ను మంత్రి హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ ప్రారంభించారు. సిద్దిపేట జిల్లాలోని మంగోల్​లో మిషన్ భగీరథ ప్లాంట్​ను నిర్మించారు. రూ.1,212 కోట్లతో నిర్మించిన ఈ నీటి శుద్ధీకరణ కేంద్రం నేడు ప్రారంభం అయ్యింది.

540 మిలియన్ లీటర్ల సామర్థ్యం: మిషన్ భగీరథకు భవిష్యత్తులో ఎలాంటి అవారోధాలు ఏర్పడొద్దు అనే లక్ష్యంతో ప్రభుత్వం సిద్దిపేటలో నిర్మించిన భారీ నీటిశుద్ధి కేంద్రం నేడు అందుబాటులోకి వచ్చింది. మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ దీనిని ప్రారంభించారు. మల్లన్న సాగర్​కు అనుబంధంగా దీనిని నిర్మించారు. ఇది అందుబాటులోకి రావడం వల్ల వివిధ జిల్లాల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. మల్లన్నసాగర్ జలాశయం నుంచి నీటిని తీసుకుని వినియోగించుకునేందుకు ప్రభుత్వం సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో 1,212 కోట్ల రూపాయలతో నీటిశుద్ధి కేంద్రం ప్రారంభించింది. కొండపాక మండలం తిప్పారం వద్ద మల్లన్న సాగర్ జలాశయంలో మిషన్ భగీరథ కోసం నీటిశుద్ధి కోసం ఇంటేక్వెల్ నిర్మించారు. ఇక్కడ నుంచి 5 కిమీల దూరంలో మంగోల్ గ్రామం వద్ద 540 మిలియన్ లీటర్ల సామర్థ్యం గల నీటి శుద్ధి ప్లాంట్​ను నిర్మించారు.

భారత్​లోనే అతిపెద్దది: మంగోల్ ప్లాంట్ నుంచి సిద్దిపేట, మెదక్ , మేడ్చల్, మల్కాజ్​గిరి, యాదాద్రి, భువనగిరి, జనగాం, సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాలకు ఈ తాగునీటిని పంపిస్తారు. వచ్చే ఐదు శతాబ్దాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మల్లన్న సాగర్ వద్ద ఈ నీటిశుద్ధి ప్లాంట్ నిర్మాణం చేపట్టారు. ఇది రాష్ట్రంలోనే అతిపెద్దది కావడమే కాక భారతదేశంలోనే అతిపెద్దది. దీని ద్వారా 7జిల్లాల్లోని 10 7నియోజక వర్గాలకు ప్రయోజనం కలుగనుంది. 1922 ఆవాసాలకు తాగునీరు అందనుంది. ఇందుకోసం మల్లన్న సాగర్​లో 30టీఎంసీల నీటిని ఇందుకోసం కేటాయించారు. ఈ ప్రాజెక్ట్​లో భాగంగా 110 కిలోమీటర్ల పైప్​లైన్​ను ప్రత్యేకంగా నిర్మించారు.

హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయి స్టోరేజ్ బోర్డు ద్వారా గోదావరి నుంచి హైదరాబాద్ వెళుతున్న నీటిని సిద్దిపేట అవసరాలతో పాటు జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల అవసరాల కోసం నీటిని తీసుకుంటున్నారు. ఇకనుంచి హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయికి సంబంధించిన నీటిని వీళ్లు తీసుకోరు. కేవలం ఇక్కడినుంచే నీటి సప్లై ఉండనుంది. దీని సామర్థ్యం రోజు 540మిలియన్ లీటర్లు కాగా అయితే సగం సామర్థ్యంలో ఈరోజు ట్రయన్ రన్ ప్రారంభించారు. ప్రతిరోజు అవసరాల కోసం హైదరాబాద్ మెట్రో సప్లయి బోర్డు నుంచి, ఆ సప్లై నుంచి 300మిలియన్ లీటర్ల నీటిని అవసరాల కోసం డ్రా చేస్తున్నారు. ఇకనుంచి ఈ 300మిలియన్ లీటర్లు కూడా హైదరాబాద్ అవసరాలకు నేరుగా వెళ్లనున్నది. ప్రస్తుతం ఔటర్ రింగురోడ్డు అవతలి వైపు ఉన్న గ్రామాలన్నింటికి కూడా హైదరాబాద్ వాటర్ సప్లయి ద్వారానే తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ఉంది. ఇక్కడ మిగిలిన 300మిలియన్ లీటర్ల నీటిని కూడా అవసరాలను తీర్చే విధంగా ఉపయోగపడేటట్లు ఉంది.

గ్రావిటి ద్వారా నీటి సరఫరా: మొత్తానికిది భారతదేశంలోనే అతిపెద్ద నీటిశుద్ధి కేంద్రం అని చెప్పవచ్చు. ప్రతిరోజు 540మిలియన్ లీటర్ల నీటిని ఇక్కడ శుద్ధి చేయనున్నారు. ఇక్కడ నుంచి రాష్ట్రంలోని 7జిల్లాలకు గ్రావిటీ ద్వారా నీటిని అందించవచ్చు. 1922 ఆవాసాలకు పూర్తిగా గ్రావిటి ద్వారానే నీటిని అందించే అవకాశం ఉంది. ఇక్కడ ఎలాంటి మోటర్ కానీ కరెంట్ కానీ అవసరం లేదు. పైపులైన్ ద్వారా పోతాయి. దీనిద్వారా భవిష్యత్​లో విద్యుత్ అంతరాయం కలిగినా కూడా నీటిసరఫరాకు ఎలాంటి అంతరాయం కలుగకుండా సరఫరా చేయొచ్చని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.