ETV Bharat / state

దుబ్బాకలో సాయంత్రం 5 వరకు 81.44 శాతం పోలింగ్

author img

By

Published : Nov 3, 2020, 3:43 PM IST

Updated : Nov 3, 2020, 5:40 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉప ఎన్నిక పోలింగ్‌ తుది దశకు చేరింది. సాయంత్రం 5 గంటల వరకు 81.44 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ బూత్‌ల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

by-poll-election-polling-percentage-in-dubbaka-till-3pm
దుబ్బాకలో సాయంత్రం 5 వరకు 81.44 శాతం పోలింగ్

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక మరికాసేపట్లో ముగియనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ‌ప్రారంభం కాగా... సాయంత్రం 5 గంటల వరకు 81.44 శాతం నమోదైంది. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారు.

గర్భిణులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక లైన్లు కేటాయించి, వీల్ ఛైర్లలో కేంద్రంల్లోకి పంపిస్తున్నారు. కేంద్రం ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు... ఓటర్లు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు పీపీఈ కిట్లతో వచ్చిన కరోనా బాధితులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

ఇదీ చూడండి: ఆరేపల్లిలో మొరాయించిన ఈవీఎం.. మరో మిషన్​తో పోలింగ్

Last Updated :Nov 3, 2020, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.