ETV Bharat / state

'కారులో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం'

author img

By

Published : Jun 22, 2019, 7:57 PM IST

ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం : పోలీసులు

వేగంగా దూసుకొచ్చిన కారు ముందున్న లారీని బలంగా ఢీకొట్టడం వల్ల ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఘటనలో కారులోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్ శివారులోని 65వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు..ముందున్న లారీని బలంగా ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ సురేందర్​ రెడ్డి తెలిపారు.

ఘటనలో అక్కడికక్కడే కారులోని ఇద్దరు వ్యక్తులు మృతి

ఇవీ చూడండి : నడిరోడ్డు మీద పోలీసుపై దుండగుల దాడి

tg_srd_56_22_road_accident_as_c6 రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి ( ) సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్ శివారులోని 65వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు.. ముందు ఉన్న లారీని బలంగా ఢీ కొట్టింది. దీంతో కారు లో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. వీరి స్వస్థలం బీదర్. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను బయట తీసి.. పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రమాదఘటన పై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తామని సీఐ సురేందర్ రెడ్డి తెలిపారు......SPOT
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.