ETV Bharat / state

సర్పంచ్​తో భూవివాదం.. గన్​​తో తిరుగుతూ

author img

By

Published : Apr 6, 2022, 5:17 PM IST

sangareddy gun issue
gun sangareddy gun issue

భూ వివాదాల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు రివాల్వర్‌తో తిరుగుతూ గ్రామంలో కలకలం సృష్టించారు. వారిని పట్టుకున్న గ్రామస్థులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మండలం ఐలాపూర్​లో జరిగింది.

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మండలం ఐలాపూర్‌ గ్రామంలో గన్‌ పట్టుకొని తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను గ్రామస్థులు పోలీసులకు పట్టించారు. భూ వివాదాల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు రివాల్వర్‌తో తిరుగుతూ గ్రామంలో కలకలం సృష్టించారు. దాంతో భయందోళనకు గురైన గ్రామస్థులు వారిని పోలీసులకు అప్పగించారు. ఇద్దరిని పోలీసు స్టేషన్‌కు తరలించి విచారించారు.

ఇద్దరు వ్యక్తులు మోహిదీపట్నం మురారి నగర్‌కు చెందిన జావెద్‌, వాజిద్‌ సోదరులని పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. వారికి ఉన్న భూమిని గ్రామ సర్పంచ్‌ అమ్ముకోవాలని ప్రయత్నిస్తున్నాడని జావెద్‌, వాజిద్‌లు తెలిపారన్నారు. దాని కారణంగానే గ్రామస్థులతో దాడిచేయించారని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అలాగే వారి వద్ద ఉన్నది లైసెన్స్‌ కలిగిన తుపాకేనని, దానిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సర్పంచ్​తో భూవివాదం.. రివాల్వర్​తో తిరుగుతూ

ఇదీచూడండి: MIM Corporator Arrest: కేటీఆర్​ ట్వీట్​.. ఎంఐఎం కార్పొరేటర్​ అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.