ETV Bharat / state

ప్రభుత్వోద్యోగిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ప్రజాప్రతినిధులు

author img

By

Published : Nov 25, 2019, 11:27 PM IST

ప్రభుత్వోద్యోగిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ప్రజాప్రతినిధులు

ఓ అధికారి తమను వేధిస్తున్నాడంటూ ప్రజా ప్రతినిధులు.. గుత్తేదారులు ప్రజావాణిలో కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి డివిజన్ పంచాయతీ రాజ్​శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజినీర్​ తులసీరాం నాయక్​పై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

సంగారెడ్డి డివిజన్​ పంచాయతీరాజ్​ శాఖలో ఉప కార్యనిర్వాహక ఇంజినీర్​గా విధులు నిర్వహిస్తున్న తులసీరాం నాయక్ తమతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడంటూ ప్రజా ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రతినిధులకు, గుత్తేదారులకు కనీస గౌరవం ఇవ్వడం లేదని హత్నూర మండలానికి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు జిల్లా కలెక్టర్ హన్మంతరావుకు ఫిర్యాదు చేశారు. చేసిన పనికి బిల్లులు చేయకుండా తమని వేధిస్తున్నాడని సంగారెడ్డి సివిల్ కాంట్రక్టర్స్ అసోషియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. పనుల పరిశీలనకు రావాలంటే కారు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాడని.. బిల్లులు చేయడానికి కింది స్థాయి అధికారుల నుంచి మామూళ్ల కోసం ఒత్తిడి చేస్తున్నాడని గుత్తేదారులు ఆరోపించారు.

ప్రభుత్వోద్యోగిపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ప్రజాప్రతినిధులు

ఇదీ చూడండి: పసిబిడ్డను ఎత్తుకుని... చంపేస్తానంటూ తండ్రి వీరంగం

Intro:Body:Conclusion:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.