సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాటి గ్రామ కూడలి నుంచి గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు సర్దార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిది కర్ణాటకలోని బీదర్ కాగా పటాన్చెరులోని చైతన్యనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. పటాన్చెరు నుంచి ద్విచక్రవాహనంపై బ్యాగులో రెండు కేజీలు చొప్పున మూడు మూటలను తరలిస్తున్నాడు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడి ద్విచక్రవాహనంతో పాటు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నాడనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : గడ్డి అన్నారంలో కార్పొరేటర్ అనుచరుల వీరంగం