విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. నాగిల్ గిద్ద మండలం కరస్ గుత్తిలో రూ.4.28 కోట్లతో నిర్మించిన బాలికల గురుకుల పాఠశాలను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. స్కూళ్లలో కల్పిస్తున్న సౌకర్యాలు, భోజన సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను సరదాగా మంత్రి ప్రశ్నించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో నాలుగు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, అధికారులు పాల్గొన్నారు.