సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షం(Rain) కురిసింది. రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా 63.8మీల్లీ మీటర్ల వర్షపాతం జిల్లాలోని కంగ్టిలో నమోదైంది. నారాయణఖేడ్లో వర్షానికి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు పొంగి పొర్లుతుండటం వల్ల నియోజకవర్గంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
రోడ్లపై భారీగా నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఆంధోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం నమోదైనట్లు వాతావరణ అధికారులు తెలిపారు.
- ఇదీ చదవండి : 'అరశాతం అప్పు కోసం.. ప్రైవేటికరణా?'