మాజీ ఎమ్మెల్యే చెంగల్ బాగన్న కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన భౌతికాకయాన్ని జహీరాబాద్ తరలించారు. బాగన్న పార్థివదేహానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు నివాళులర్పించారు. బాగన్న నిజాయితీ గల నాయకుడిగా రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు.
వార్డు సభ్యుడిగా, గ్రామ సర్పంచిగా, ఎంపీపీగా ఎమ్మెల్యేగా, శాసనసభలో అంచనాల కమిటీ సభ్యుడిగా పనిచేసిన బాగన్న సొంత ఇల్లు కూడా లేని స్థితిలో మరణించడం బాధాకరమన్నారు. గతంలో ఇంటి స్థలం కేటాయించి నిర్మాణానికి కొంత ఆర్థిక సహాయం అందించామని... పార్టీ పక్షాన అవసరమైన నిధులు సమకూర్చి ఇల్లు పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని మంత్రి తెలిపారు. జహీరాబాద్లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హరీశ్ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: బిట్టు శ్రీనును పోలీస్ కస్టడీకి అనుమతించిన కోర్టు