ETV Bharat / state

'తెరాసతో పొత్తు ప్రసక్తే లేదు.. రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ మోదీ నాశనం చేశారు'

author img

By

Published : Oct 31, 2022, 3:32 PM IST

Updated : Oct 31, 2022, 7:24 PM IST

Rahul Gandhi Fires on BJP and TRS: దేశంలో భాజపా, రాష్ట్రంలో తెరాస ఒకే విధానాన్ని అవలంభిస్తున్నాయని కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ విమర్శించారు. దేశ సమైక్యత కోసం జోడో యాత్రను మొదలుపెట్టినట్లు పునరుద్ఝాటించిన రాహుల్.. సీఎం కేసీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొందరు నేతలు ఎవరికి వారు తమది పెద్ద పార్టీ అని ఊహించుకుంటున్నారన్న రాహుల్.. భారాస అంతర్జాతీయ పార్టీగా ప్రకటించుకోవచ్చని చురకలంటించారు. తెరాసతో ఎలాంటి అవగాహన గానీ.. పొత్తు గానీ ఉండదని రాహుల్‌ స్పష్టం చేశారు.

'రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ మోదీ నాశనం చేశారు.. పొత్తు ప్రసక్తే లేదు'
'రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ మోదీ నాశనం చేశారు.. పొత్తు ప్రసక్తే లేదు'

'తెరాసతో పొత్తు ప్రసక్తే లేదు.. రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ మోదీ నాశనం చేశారు'

Rahul Gandhi Fires on BJP and TRS: తెరాసతో ఎలాంటి అవగాహన కానీ.. పొత్తు కానీ ఉండదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. తెరాసతో పొత్తు ఉండరాదని కాంగ్రెస్‌ తెలంగాణ నాయకత్వం నిర్ణయించిందని.. ఈ నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నట్టు రాహుల్‌ చెప్పారు. ఆరో రోజు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ప్రారంభమైన భారత్‌ జోడో యాత్ర.. కొత్తూరు మండలానికి చేరుకుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు రాహుల్ వెంట నడిచారు. కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద భోజన విరామం అనంతరం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన రాహుల్.. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస విధానాలను ఎండగట్టారు.

భాజపా, తెరాస రెండు పార్టీలూ ఒకే విధానాన్ని అవలంభిస్తున్నాయని ఆక్షేపించారు. సీఎం కేసీఆర్‌పైనా రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొంతమంది ఎవరికి వారే తమది పెద్ద పార్టీగా ఊహించుకుంటున్నారని, అంతర్జాతీయ పార్టీగా ప్రకటించుకొని అమెరికా, చైనాలోనూ పోటీ చేయవచ్చని రాహుల్ ఎద్దేవా చేశారు.

తెరాసతో కాంగ్రెస్‌కు ఎలాంటి పొత్తు ఉండదు. ఈ విషయంలో కాంగ్రెస్‌ చాలా స్పష్టతతో ఉంది. కావాలనే తెరాస వర్గాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. తెరాసతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం ఉండదని మరోసారి కరాఖండిగా చెబుతున్నా. ఏ నాయకుడైనా తన పార్టీని ఎలాగైనా ఊహించుకునే హక్కు ఉంటుంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ తాను నడిపే పార్టీని జాతీయపార్టీగా నమ్ముతున్నారు. దానికి ఎలాంటి సమస్యా లేదు. అంతర్జాతీయ పార్టీని నడుపుతున్నాడని తాను అనుకుంటే దాన్ని అంగీకరించవచ్చు. అవసరమైతే అమెరికా, చైనాలోనూ పోటీపడతానని తాను ఊహించుకుంటే మేం సంతోషంగా స్వాగతిస్తాం.- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత

భాజపా విద్వేష రాజకీయాలను తిప్పికొట్టాలనే ఉద్దేశంతోనే భారత్‌ జోడో యాత్ర కొనసాగిస్తున్నట్లు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందించిన రాహుల్.. అవినీతి డబ్బుతో ఆ పని చేస్తున్నాయని ఆరోపించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో.. రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం జరగనుందని, ఇది విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్యేనని తెలిపారు. ప్రధాని మోదీ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని చెప్పిన రాహుల్‌.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అన్నింటినీ ప్రక్షాళన చేస్తామన్నారు. యాత్ర కశ్మీర్‌కు చేరుకున్నాక రాజకీయ అంశాలకు గట్టిగా బదులిస్తానని తెలిపారు.

ప్రస్తుతం దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం సాగుతోంది. విద్వేష, విభజన, హింసాత్మక శక్తులు, సంఘటిత శక్తుల మధ్య పోరు జరుగుతోంది. విపక్షాలన్నీ సంఘటితమై పోరాడి భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలను ఓడించి విజయం సాధిస్తాయి. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయకేతనం ఎగురవేస్తుంది. కలిసికట్టుగా పోరాడుతాం. కాంగ్రెస్‌ మూల సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తాం. - రాహుల్‌

ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కొనసాగుతున్న రాహుల్‌ యాత్ర మంగళవారం ఆరాంఘర్ మీదుగా నగరంలోకి అడుగుపెట్టనుంది.

ఇవీ చూడండి..

భాజపా, తెరాస రెండూ ఒక్కటే.. ఎన్నికలు వచ్చినప్పుడు కలిసి నాటకాలాడుతున్నాయి: రాహుల్​

Revanth Reddy on Bharat Jodo Yatra : 'రాహుల్‌తో కలిసి ఒక్క కిలోమీటరైనా నడవాలి'

Last Updated : Oct 31, 2022, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.