ETV Bharat / state

వృద్ధురాలిని హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

author img

By

Published : Jan 28, 2020, 10:16 AM IST

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఓ వృద్ధురాలిని హత్య చేసి ఒంటిపై ఉన్న 8 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

old women was killed at nedunuru in rangareddy district
వృద్ధురాలిని హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

వృద్ధురాలిని హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరులో దారుణం చోటుచేసుకుంది. గ్రామశివారులో ఒంటరిగా నివసిస్తోన్న బాలమణి (80) అనే వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.

ఆమె ఒంటిపై ఉన్న 8 తులాల బంగారు ఆభరణాల్ని ఎత్తుకెళ్లారు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. బాలమణి ఇళ్లు ఊరికి చివర ఉండటం, ఇంట్లో ఆమె ఒంటరిగా ఉంటుందని తెలిసిన వారే ఎవరైనా ఈ దారుణానికి ఒడిగట్టారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Intro:రంగారెడ్డి జిల్లా : కందుకూరు మండలం నేదునూరులో దారుణం చోటుచేసుకుంది. వృద్ధురాలిని హత్య చేసి వంటిపై ఉన్న 8తూలాల బంగారు ఆభరణాలు అపహరించుకెళ్లిన దుండగులు. మృతి చెందిన వృద్ధురాలిని సరిగారి బాలమణి (80)గా పోలీసులు గుర్తించారు. రాత్రి గుర్తు తెలియని దుండగులు వృద్ధురాలి వంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు దోచుకోవడానికి వచ్చిన దుండగుల చేతిలో హతమైనట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఉరికి చివరగా ఇళ్లు ఉండటంతోపాటు ఇంట్లో బాలమణి ఓంటరిగా ఉంటుందని ఎవరైనా తెలిసినవారే ఈ దారుణానికి పాల్పడ్డారా అనే కోణంలో సంఘటనా స్థలానికి చెరుకున్న కందుకూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.Body:Tg_Hyd_11_28_Choori Murder_Av_TS10012Conclusion:Tg_Hyd_11_28_Choori Murder_Av_TS10012
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.