ETV Bharat / state

'జీతం అడిగితే ఉద్యోగం తీసేస్తున్నారంటూ ఫిర్యాదు'

author img

By

Published : Dec 15, 2020, 8:53 PM IST

ప్రైవేట్​ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జీతాల్లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. జీతాలు అడిగినవారిని ఏకంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఓ ఇంజినీరింగ్​ కళాశాలపై ఉద్యోగుల సంఘం ఫిర్యాదు చేయడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

Complaint asking for salary in engg colleges in rangareddy dist
'జీతం అడిగితే ఉద్యోగం తీసేస్తున్నారంటూ ఫిర్యాదు'

జీతాలు అడిగితే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నారంటూ రాష్ట్ర ప్రైవేట్​ అధ్యాపక ఉద్యోగుల సంఘం నాయకులు జేఎన్టీయూహెచ్​లో ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా బాటసింగారంలోని అర్జున్​ కాలేజ్​ ఆఫ్​ ఇంజినీరింగ్​ అండ్​ సైన్స్ యాజమాన్యంపై జేఎన్టీయూహెచ్​ రిజిస్ట్రార్​ దృష్టికి తీసుకువచ్చారు. కరోనా వల్ల యాజమాన్యాలు ప్రైవేట్​ అధ్యాపకులకు జీతాలు చెల్లించడం లేదని వాపోయారు.

రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్​ 45ని కళాశాల యాజమాన్యాలు అమలు చేయడం లేదంటూ రాష్ట్ర అధ్యక్షులు సంతోశ్​ కుమార్​ ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసీటీయూ మార్గదర్శకాల ప్రకారం జీతాలు చెల్లించడం లేదన్నారు. అధ్యాపకులకు న్యాయం చేయాలంటూ రిజిస్ట్రార్​ను కోరామని...అందుకు సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు.

ఇదీ చూడండి:ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్రపై విచారణ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.