ETV Bharat / state

రాష్ట్రంలో ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లు.. ఇప్పటివరకు ఎంతంటే.!

author img

By

Published : May 8, 2022, 6:55 PM IST

Updated : May 8, 2022, 7:01 PM IST

Civil Supply on Rice Grain: యాసంగి దిగుబడికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 5,299 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ 7.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

paddy procurement centres in telangana
తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు

Civil Supply on Rice Grain: రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది యాసంగి సీజన్‌లో 6,832 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పౌరసరఫరాలశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు ధాన్యం దిగుబడికి అనుగుణంగా 30 జిల్లాల్లో 5,299 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని పౌరసరఫరాలశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ రోజు వరకు 76,495 మంది రైతుల నుంచి రూ. 1,483 కోట్ల విలువైన 7.59 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వివరించింది.

ఇందులో 7.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైసుమిల్లులకు తరలించామని అధికారులు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం కొనుగోళ్ల కోసం 8.36 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

ఇవీ చదవండి: 'తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్'.. రాహుల్​పై నిరంజన్ ఫైర్

మిస్టర్ సీఎం.. ధైర్యముంటే నాపై పోటీ చేయండి: నవనీత్ సవాల్

Last Updated : May 8, 2022, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.