ETV Bharat / state

'పేదలకు  కరువు సాయం రూ.10వేలు ఇవ్వాలి’

author img

By

Published : May 28, 2020, 6:47 PM IST

లాక్​డౌన్​ కారణంగా ఉపాధి లేక చితికిపోయిన నిరుపేద కుటుంబాలకు రూ. 10వేలు అందించాలని కాంగ్రెస్​ పార్టీ వేములవాడ ఇంఛార్జి ఆది శ్రీనివాస్​ డిమాండ్​ చేశారు. వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు ఆర్థికంగా చితికిపోయారని, కేంద్ర ప్రభుత్వాలు వారిని ఆదుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు.

Vemulawada Congress Incharge Demands For Rs.10 Thousands For Poor People
'పేదలకు  కరువు సాయం రూ.10వేలు ఇవ్వాలి’

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కాంగ్రెస్​ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి ఆది శ్రీనివాస్​ సమావేశం ఏర్పాటు చేశారు. లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు పడుతున్న కార్మికులు, పేదలు, వలస కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, మత్స్య కార్మికులు, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. లాక్​డౌన్​ అమలులో దేశ ప్రధానమంత్రి మోదీ అనాలోచిత నిర్ణయాల వల్ల వలస జీవులు ఆగమయ్యారని, వారిని ప్రభుత్వ ఖర్చులతో సొంతగూటికి చేర్చాలని కోరారు. చిరు వ్యాపారులకు ప్రభుత్వ గ్రాంట్స్​తో పాటు.. ఉపాధి హామీ పని దినాలను 100 నుంచి 200 రోజులకు పెంచాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: మండుతున్న ఎండలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.