ETV Bharat / state

'జులాయి' సీన్​ రిపీట్.. అదొక్కటే తేడా.. మిగతాదంతా సేమ్​ టు సేమ్..!

author img

By

Published : Mar 12, 2023, 12:23 PM IST

Police caught chain snatchers in Karimnagar
కరీంనగర్​ జిల్లాలో చైన్​ స్నాచర్స్​ని పట్టుకున్న పోలీసులు

Police Caught Chain Snatchers in Karimnagar: నేను దొంగతనం చేసేటప్పుడు మెడకు ఉన్న చైన్​ తప్ప.. అది వేసుకున్న వ్యక్తిని చూడను అని జులాయి సినిమాలో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్​ గుర్తుందా. ఈ చైన్​ స్నాచర్ కూడా అచ్చం అలాగే చేశాడు. ఆ సినిమాలో బ్రహ్మానందం తన ఆలి మెడలో చైన్​ కొట్టేసి దొరికిపోతే.. ఈ నిజ జీవిత కథలో మాత్రం మనోడు తన అమ్మమ్మ మెడలో గొలుసు దొంగిలించాడు. ఇదొక్కటే తేడా.. మిగతాదంతా సేమ్​ టు సేమ్.

Police Caught Chain Snatchers in Karimnagar: దొంగతనాలు చేసేందుకు అలవాటు పడిన వ్యక్తులు ఎంతకైనా తెగిస్తారు. కొట్టేయాలని ఒక్కసారి ఫిక్సైతే చాలు.. వారి చూపులన్నీ టార్గెట్​ చేసిన వస్తువు మీదే ఉంటాయి. ఈ క్రమంలో వస్తువు ఓనర్​ను సైతం కొన్నిసార్లు పట్టించుకోరు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ దొంగ.. అచ్చం ఇలాగే చేశాడు. తాను దొంగతనం చేసేందుకు ఇంట్లో వ్యక్తినే టార్గెట్​ చేసుకున్నాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. చందుర్తి సీఐ కిరణ్​ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం పల్లిమక్తకు చెందిన ఓ వృద్దురాలి మెడలో నుంచి హోలీ పండగ రోజున గుర్తు తెలియని వ్యక్తులు 3 తులాల పుస్తెల తాడు తెంపుకుపోయారు. మరుసటి రోజు ఆమె స్థానిక పోలీస్ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేసింది. గ్రామంలోని ఇద్దరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ఆ దిశగానే పోలీసులు విచారణ చేపట్టారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసినా చోరీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో దర్యాప్తు రూట్​ మార్చారు.

ఈ క్రమంలోనే మల్కపేట గ్రామానికి చెందిన వృద్ధురాలి మనవడు ఎక్కలదేవి కరుణాకర్‌, అతడి స్నేహితుడికి గతంలో దొంగతనాలు చేసిన చరిత్ర ఉందని తెలుసుకున్నారు. వారిపై అనుమానంతో సాంకేతికతను ఉపయోగించారు. ఘటన జరిగిన ప్రదేశానికి దగ్గరల్లో ఉన్న సీసీ కెమెరాలను, సెల్​ఫోన్​ లొకేషన్​ల ఆధారంగా వృద్ధురాలి మనవడే.. తన స్నేహితుడితో కలిసి ఈ దొంగతనం చేశాడని నిర్ధారించుకున్నారు. నిందితులను పట్టుకుని బంగారం, ఓ ద్విచక్ర వాహనం, ఇద్దరి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని పోలీస్​​ స్టేషన్​కు తరలించారు.

విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్​కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. 2 రోజుల్లోనే కేసును పరిష్కరించినందుకు సిబ్బందిని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అభినందించారు. ఇంటి దొంగను పట్టించి.. తన సొమ్మును రికవరీ చేసి ఇచ్చిన పోలీసులకు వృద్ధురాలు కృతజ్ఞతలు తెలిపింది.

"వృద్దురాలి మెడలో 3 తులాల బంగారాన్ని తెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. ఈ విషయంపై మాకు కంప్లైంట్​ రావడంతో విచారించగా.. ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేశారని తెలుసుకున్నాం. వారిని ఈరోజు పట్టుకున్నాం. తీరా చూస్తే నిందితుల్లో ఒకరు వృద్దురాలికి మనవడు అవుతాడు. ఇతనికి గతంలోనూ నేర చరిత్ర ఉంది."- కిరణ్ కుమార్ ,చందుర్తి సీఐ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.